Posts

Showing posts from December, 2020

పరాజితుల విముక్తి ఎప్పుడు? ఎలా?

తరాలుగా బానిసత్వంలో మగ్గిన జాతుల్లో పరివర్తన అంత సులభం కాదు. వారు వారి మెదళ్లకు పని చెప్పే పని ఏనాడో మానుకున్నారు. అందుకే తమ పూర్వీకుల్లాగే జీవించడానికి సిద్దపడ్డారు. దానికి రకరకాల తాత్విక నిర్వచనాలు కూడా ఇచ్చుకొని ఉన్నారు. "ఉన్నంతలో జీవించాలి. అధికమైన ఆశలు అంత మంచివి కావు డబ్బు మనుషులను స్వార్థపరులుగా మారుస్తుంది. మన కులవృత్తిలోనే మనం జీవించాలి"వంటి ఎన్నో అడ్డుగోడలు సమాజం నిర్మించింది. వాటిని పరాజితులు శిరసా వహిస్తూ తరతరాలుగా ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా ఆకలి, పేదరికం, దారిద్ర్యం వంటి అవస్థలతో కలిసి జీవించడానికి సిద్ధపడ్డారు. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి యేండ్లు దాటినా ఇంకా వెలివాడల్లో పొద్దుపొడవలేదు. అందుకు అనేక కారణాలు, వాటిలో తమ స్వయంకృత అపరాధం కూడా లేకపోలేదు. బాబా సాహెబ్ అంబేడ్కర్ తన పీహెచ్డీ పరిశోధనలో భాగంగా రూపాయి పుట్టుక దాని మూలం గురించి క్షుణ్ణంగా శోధించాడు. ఆ పరిశోధన నుండే ఆర్బీఐ పంటి సంస్థలు పుట్టకొచ్చాయి. ఆయన పరిశోధనను, ఆలోచనలను పరాజిత జాతులు అందిపుచ్చుకోలేక పోయాయి. దీంతో ఆలోచించాల్సింది వ్యాపారం ఏ కొందరికో కాపీరైట్ ఈ జాతుల్లో మార్పు ఏ మాత్రం సాధ్యప...

పూజల పేరుతో నడిచిన శృంగార క్రీడ

భారత దేశం లో పూజ అంటే  చాలా పవిత్ర భావం. ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మికత. కానీ లోతుల్లోకి  వెళ్తే పూజ అంటే బూతు లేదా శృంగారం. ఈ విషయం కొన్ని దేవాలయాల చరిత్రను చూస్తే అర్థం అవుతుంది. తాపీధర్మారావు గారి “దేవాలయాలపై  బూతుబొమ్మలు” అనే పరిశోధనా గ్రంధం  ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.అలాగే మనదేశములో అనేక దేవాలయాలపై అత్యంత జుగుప్సాకరమైన బూతుబొమ్మలు  దర్శనం యిస్తుంటై.  మరి దేవాలయాలపై ఈ బూతుబొమ్మలేం టి? అనే అనుమానం  రాకపోదు. అంటే ఒకనాడు దేవాలయాలు శృంగార, కామకేంద్రాలు  అని గుడుల చరిత్ర చూస్తే తెలుస్తుంది.  కృష్ణదేవరాయల కాలంలో ఖజానాకు ఎక్కువ ఆదాయం గుడుల్లో జరిగే సంభోగాల వల్లనే అని చరిత్ర చెబుతోంది; ఇప్పటికీ   “వీడేదో రాచకర్యం వెలగబెడుతున్నాడురా” అనే నానుడి తిరుగుబోతుల గురించి వింటుంటాం. అంటే శృంగారం అనేది ఒకప్పుడు రాజులచేత మనబడింది. చాలామంది రాజుల రాజ్యంలో “భోగం బజారులు” కూడా చాలా సామాన్యం. అందుకే  “పూజ” అనే పదం ఈ శృంగారం నుండి పుట్టిందే. రతి కార్యక్రమానికి ముందే రెచ్చగొట్టే చర్యలే ఈ పూజలు. పార్వతి పెళ్లికి ముందే  శివున్ని పూజించడానికి...

నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం

https://bit.ly/37CMRFM                       తెలుగు వారంతా మద్రాసు రాష్ట్రం నుండి విడివడి ఒకే పరిపాలన క్రిందకు రావాలని ఆనాటి తెలుగు ప్రజల కోరుకున్నారు. తెలుగు భాషా సాంస్కృతిక సాహిత్య ఉద్యమాలు ఒకవైపు, పొట్టి శ్రీరాములు వంటి మహానీయుల త్యాగాలుమరో వైపు, అనేక ప్రజా ఉద్యమాలు, కమ్యూనిస్టుల సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలో 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.        కమ్యూనిస్టులు  "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అన్న నినాదం ఇచ్చారు. విశాలాంధ్ర ఏర్పడింది గానీ ప్రజారాజ్యం రాలేదు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి, అధికారంలోకి వచ్చిన పార్టీలు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయలేకపోయాయి. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర లు అభివృద్ధి లో వెనుకబడినాయి.     అన్నపూర్ణగా పేరుగాంచిన ఉమ్మడి రాష్ట్రంలో నూటికి 74మంది పౌష్టికాహారం తినడం లేదని ప్రభుత్వ లెక్కలతోనే ప్రొఫెసర్ ఉత్సా పట్నాయక్ తెలియజేశారు. పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలు వేసిన రైతులు కాక ఇతర రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.ప్రజలకు వి...