Posts

కమ్యూనిస్టు మేనిఫెస్టో సందేశం

కమ్యూనిస్టు మేనిఫెస్టో యొక్క 177 వ వార్షికోత్సవ సందర్భంగా మేనిఫెస్టో మనకు ఇస్తున్న సందేశం !  ------------------------------------------------------ కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రచురించిన అన్ని పత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన పత్రం కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో . ఇది 177 సంవత్సరాల క్రితం ప్రచురించబడింది. దీని రచయితలు కార్ల్ మార్క్స్ - ఫ్రెడరిక్ ఎంగెల్స్ లు. యూరోప్ లో ప్రజాతంత్ర విప్లవ పోరాటాలు ప్రజ్వరిల్లుతున్న సందర్భంలో ఈ మ్యానిఫెస్టో కమ్యూనిస్టు లీగ్ అధ్వర్యంలో 1848 ఫిబ్రవరి 21 న ప్రచురింపబడింది.    సోషలిజం లేదా కమ్యూనిజం గురించిన ఆలోచనలు మార్క్స్ - ఎంగెల్స్‌ లతోనే ప్రారంభం కాలేదు. వారికి ముందు, సమిష్టి ఆస్తిపై ఆధారపడిన వర్గరహిత సమాజం గురించి ఆలోచనలు చేసిన సమర్ధించిన గొప్ప ఆలోచనాపరులు కూడా ఉన్నారు: తొలి క్రైస్తవులు ప్రైవేట్ ఆస్తి లేని సమాజాల గురించి కలలు కన్నారు. 16వ శతాబ్దంలో థామస్ మోర్, 18వ శతాబ్దంలో బెబూఫ్,, మొరెల్లి, మాబ్లిలు 19వ శతాబ్ది ప్రారంభంలో రాబర్ట్ ఓవెన్, ఫోరియర్, సెయింట్ సైమన్ లాంటి గొప్ప ఆలోచనాపరులు దోపిడి-పీడన, అసమానతలు లేని సమ సమాజానికి చెందిన ఊహాజనిత సిద్ధ...

రూపం మార్చుకుంటున్న ఫాసిజం_ ప్రజాస్వామిక వాదుల కర్తవ్యాలు

రూపం మార్చుకుంటున్న ఫాసిజం_  ప్రజాస్వామిక వాదుల కర్తవ్యాలు              "ఫాసిజం ముఖ్యమైన లక్షణం సత్యాన్ని విమర్శించడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం." ___ జార్జ్ ఆర్వెల్       ఫాసిజం 20వ శతాబ్దపు ప్రారంభంలో యూరప్‌లో మొదలైన ఒక రాజకీయ భావజాలం. ఇది ప్రధానంగా మన జాతి ఉన్నతమైనదని ప్రచారం చేసే జాతీయవాదం తో మొదలవుతుంది. మాధ్యమాలను నియంత్రిస్తుంది. మతాన్ని రాజకీయాలతో కలిపి యూదులు, కమ్యూనిస్టులను సామాజిక శత్రువులుగా ప్రచారం చేస్తుంది.       ఫాసిజం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేసే ఒక రాజకీయ ధోరణి. ఇది అతిజాతీయ వాదాన్ని, మతాధిక్యతను, స్థానికతను ఉపయోగించుకుంటూ విదేశీయులకు వ్యతిరేకంగా హింసను సాధనంగా చేసుకుంటుంది. ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లర్, స్పెయిన్‌లో ఫ్రాంకో వంటి నియంతలు దీన్ని గణనీయంగా అనుసరించారు. భారతదేశంలో ఈ ధోరణులను మెజారిటీ మతవాద సంస్థ దీన్ని అమలు చేయడం గమనించవచ్చు.       ఇటలీలో బెనిటో ముస్సోలిని (1922-1943) ఫాసిజాన్ని కార్పొరేటివిజంగా అమలు చేశాడు, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ (1933-19...

పార్టీ పాత్ర: మార్గదర్శకత్వమా, బదులుగా తనే పనిచేయడమా?

*పార్టీ పాత్ర: మార్గదర్శకత్వమా, బదులుగా తనే పనిచేయడమా?*         పార్టీ ఏదో మంచితనం కోసం ప్రజా సంఘాల్లో పనిచేయడం లేదు. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం వైపు వర్గాలనూ, ప్రజలనూ సమీకరించేందుకు తను చేస్తున్న కృషిలో ప్రజా సంఘాలు ఒక ముఖ్యమైన లింకు అని పార్టీ భావిస్తోంది. అందువల్ల మనం ప్రజా సంఘాల స్వతంత్ర పనివిధానం అంటున్నామంటే దానర్ధం, పార్టీ ఏ విధంగానైనా ప్రజా సంఘాల జీవితంలో జోక్యం చేసుకోవచ్చని కాదు. దానర్థం ఏమంటే పార్టీ మార్గదర్శక పాత్ర వహిస్తుంది మినహా, ప్రజా సంఘం స్థానాన్ని ఆక్రమిస్తుందని కాదు.  ఒక ప్రజా సంఘంలో పార్టీ పనిచేసే విధానం ఎలా ఉండాలంటే, ఆ ప్రజా సంఘపు సాధారణ లక్షణానికి భంగం కలిగించకుండా దాని వెనుకనున్న మెజారిటీ ప్రజానీకంపై క్రమంగా తన ప్రభావంతో పట్టు సాధించగలగాలి. పార్టీ మార్గదర్శక పాత్రను ఆదేశాలతోనో, అధిపత్యంతోనో, లేక దాని కమిటీలను పార్టీ సభ్యులతో నింపేయడంతోనో జరగకూడదు. అలా కాకుండా వాటిలో పనిచేస్తున్న పార్టీ సభ్యులను, మనతో విభేధించే పార్టీయేతరులను కూడా ఒప్పించి వారిని మన అవగాహనలోకి తీసుకురావాలి. పార్టీ మార్గదర్శక పాత్ర అంటే, అది వెనుకబడిన సెక్షన్ ప్రజలు ని...

ప్రజలు కూటమికి పట్టం కట్టారు.

         ప్రజలు కూటమికి పట్టం కట్టారు.  ఇప్పుడు కూటముందున్న ప్రధాన కర్తవ్యం ప్రత్యేక హోదా తీసుకురావడం ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక సెంటిమెంట్ వ్యవహారానికి సంబంధించింది. కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ చాలాసార్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా తప్పనిసరిగా రావాలని డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా తెచ్చుకునే బాధ్యత దానిపైన ఎక్కువగా ఉంది.   కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కూడా జనసేన ది ప్రధాన బాధ్యత అవుతుంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా అలాగే నిధులు జనసేన తీసుకొచ్చే అంశం మీద దాని ప్రగతి ఆధారపడి ఉంటుంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వకపోతే ఏం చేస్తాడు అన్నది ఆయనకు సవాల్ గా ఉందిప్పుడు.         21 మంది గెలవడంతో సంఖ్యాపరంగా ఆయన బలగం బాగుంది అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేని పక్షంలో ఆయన ఏ మేరకు ఆ పార్టీతో కలిసి ఉంటాడు అన్నది ఓ ప్రశ్న.        ఉప ముఖ్యమంత్రి పదవిగా తీసుకున్నప్పటికీ ఆయన పంచాయతీ రాజ్ ను చూస్తానని కూడా తీసుకున్నాడు అంటే గ్ర...

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం           యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ  ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన  రాజకీయ పార్టీ.   ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  ముఖ్య మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డా. వై.యస్. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదం లో మరణించడంతో ఆయన కుమారుడు , కాంగ్రెస్ పార్టీ ఎం.పి. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ ని స్థాపించారు.      తండ్రి మరణించాక   జగన్  ఓదార్పు యాత్ర చేపట్టాడు. అందుకు  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదు. దాంతో జగన్ క్రొత్త పార్టీ నెలకొల్పాలనుకున్నాడు.  వైఎస్సార్ కాంగ్రెస్ ను 2011 మార్చిలో  స్థాపించారు. సహజంగానే జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా ఉన్నారు.       పార్టీ పెట్టగానే సోనియాగాంధీ నుంచి రాజకీయ కక్షసాధింపులు మొదలయ్యాయి. సిబిఐ కేసులు జగన్ పై పెట్టారు.   సంస్థాగతంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ కేసులో చాలా సహకరించాయి.అండగా ఉంటారను...

కూటమి ఏర్పాటులో కీలకమైన జనసేన ప్రస్థానం

కూటమి ఏర్పాటులో కీలకమైన జనసేన ప్రస్థానం               "చేగువేరా మా ఆదర్శం. పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం మేమున్నాం" అంటూ సినిమాలలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన అన్న చిరంజీవి రాజకీయాల్లో ఏర్పరచిన ఖాళీని భర్తీ చేస్తూ 2014లో మార్చి 10న జనసేన పార్టీ ని హైదరాబాద్ లో స్థాపించారు. అదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రా లలో ఉంది. జన సేన అంటే ప్రజా సైన్యమని అర్ధం. పార్టీ లోగో, రంగులు పెద్ద పెద్ద ఆశయాలను తలపిస్తాయి. జనసేనాని మాటలు కూడా పెద్ద పటాటోపంతో ఉంటాయి. కానీ ఆచరణలో ఆ పార్టీ అందుకు భిన్నంగా ఉండటం అందరినీ కలవరపెడుతోంది..        పార్టీ ని ప్రారంభిస్తున్న సమయంలో బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన, విద్య, వైద్యం మెరుగుపరచడం, చట్టాల అమలులో అందరికీ సమన్యాయం, ప్రజాధనం వ్యయానికి కాపలా, జాతీయ సమైక్యత లను జనసేన మౌలిక లక్ష్యాలుగా పేర్కొన్నారు పవన్.             పార్టీ చిహ్నాన్ని మన దేశ చరిత్రను, పోరాటాలను నిర్వచించే ఒక ఐక్య సంఘటన గా చెప్పుకున్నారు. చిహ్నం లోని తెలుపు రంగు ...

2025 వక్ఫ్ (సవరణ) బిల్లు – ముఖ్యాంశాలు:

2024 వక్ఫ్ (సవరణ) బిల్లు – ముఖ్య ాంశాలు: 1. సర్వే అధికార మార్పు: వక్ఫ్ భూముల సర్వే అధికారాన్ని వక్ఫ్ కమిషనర్ నుండి కలెక్టర్‌కు బదిలీ చేయడం ద్వారా ముస్లింల అధికారాన్ని తగ్గించారు. 2. బోర్డు సభ్యుల మార్పు: వక్ఫ్ బోర్డులో ముస్లింల సంఖ్య తగ్గించి, ముస్లిం కాని సభ్యులను మెజారిటీగా నియమించే అవకాశం కల్పించారు. ఇది ముస్లింల అభిప్రాయాలను బేఖాతరు చేయడానికే. 3. ముస్లిం మహిళల ప్రాతినిధ్యం: ఇద్దరు ముస్లిం మహిళల నిబంధన ఉన్నా, మిగతా సభ్యులలో ముస్లిం కానివారు ఉంటే వహీ ముస్లిం మహిళల అభిప్రాయాలు బలహీనమవుతాయని విమర్శ. 4. సీఈఓ నియామకం: మతపరమైన అవగాహన లేకపోయినవారు ఈ పదవిలోకి వస్తే,  సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. 5. ట్రిబ్యూనల్ మార్పులు: ముస్లిం చట్ట నిపుణుని తప్పించడం ద్వారా, న్యాయ నిర్ణయాల్లో మత పరమైన అవగాహన లేకుండా పోతుంది. 6. వక్ఫ్ దానం నిబంధన: ఐదు సంవత్సరాలుగా ముస్లిం మతాన్ని అనుసరించినవారే వక్ఫ్‌కు ఆస్తి దానం చేయగలరన్న నిబంధన, ఇది కొత్తగా మతం మార్చినవారికి అడ్డంకిగా మారుతుంది. 7. సామూహిక న్యాయం గురించి ప్రశ్న: హిందూ దేవాలయాల పాలనలో మతేతరులకు చట్టం అవకాశం కల్పించకపోవడం, కానీ వక్ఫ్ బోర్డులో...