Posts

Showing posts from January, 2021

పంచాయతీ ఎన్నికలు

Image
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి గ్రామాల్లో చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. పోటీ చేయాలనుకుంటున్న వారికి ఏయే అర్హతలు ఉండాలి? ఎవరు అనర్హులవుతారు? తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ కరదీపిక ప్రచురించింది. అందులోని ప్రధానాంశాలు..  అర్హతలు 🔹 అభ్యర్థులు ఏ పంచాయతీ పరిధిలో పోటీ చేయదలిచారో.. అక్కడి ఓటర్ల జాబితాలో వారి పేరు నమోదై ఉండాలి. 🔹  పోటీ చేయదలిచిన అభ్యర్థుల వయసు నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. 🔹  ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వారికి రిజర్వు చేసిన స్థానాల్లోనే కాకుండా అన్‌రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేయొచ్చు. 🔹మహిళా అభ్యర్థులు అదే కేటగిరిలో జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయొచ్చు. వీరు అనర్హులు. 🔹గ్రామసేవకుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగులు, చట్టాల ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన పాలక మండలి సభ్యులు అనర్హులు. 🔹నీతిబాహ్యమైన నేరానికి పాల్పడ్డారని రుజువై, శిక్ష పడినవారు.. ఆ శిక్షా కాలం ముగిసిన తేదీ నుంచి ఐదేళ్లపాటు పోటీకి అనర్హులు. 🔹పౌర హక్కుల ప...

జనసేన

Image
జనసేన ప్రస్థానం               "చేగువేరా మా ఆదర్శం.  పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం మేమున్నాం" అంటూ సినిమాలలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన అన్న చిరంజీవి రాజకీయాల్లో ఏర్పరచిన ఖాళీని భర్తీ చేస్తూ   2014లో  మార్చి 10న  జనసేన పార్టీ ని  హైదరాబాద్ లో    స్థాపించారు.  అదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రా లలో ఉంది. జన సేన అంటే ప్రజా సైన్యమని అర్ధం. పార్టీ లోగో, రంగులు  పెద్ద పెద్ద ఆశయాలను తలపిస్తాయి. జనసేనాని మాటలు కూడా పెద్ద పటాటోపంతో ఉంటాయి. కానీ ఆచరణలో ఆ పార్టీ అందుకు భిన్నంగా ఉండటం అందరినీ కలవరపెడుతోంది..        పార్టీ  ని ప్రారంభిస్తున్న సమయంలో  బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన, విద్య, వైద్యం మెరుగుపరచడం, చట్టాల అమలులో అందరికీ సమన్యాయం, ప్రజాధనం వ్యయానికి కాపలా, జాతీయ సమైక్యత లను జనసేన మౌలిక లక్ష్యాలుగా  పేర్కొన్నారు పవన్.             పార్టీ చిహ్నాన్ని మన దేశ చరిత్రను, పోరాటాలను నిర్వచించే ఒక ఐక్య...

ఆంధ్ర రాష్ట్రం...అధికారిక చిహ్నం

Image
ఆంధ్ర రాష్ట్రం...అధికారిక చిహ్నం 2500 సంవత్సరాల నాటి ‘అమరావతి’ బౌద్ధస్థూపంలోని పూర్ణఘటం బొమ్మ ఆధారంగా  ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం  తయారు చేశారు. ఈ చిహ్నం 1953లో ప్రథమంగా వాడుకలోకి వచ్చినా తరువాత అనూహ్యంగా పూర్ణం కుంభంగా మారిపోయి వాడబడింది. 2018 ఆగష్టు 15న తిరిగి వాడుక ప్రారంభమైంది. పూర్ణఘటం అంటే అక్షయపాత్ర దీనిచుట్టూ తామరపూలు మొగ్గలు వున్నాయి. దీనిని విదికుడు అనే చర్మకారుడు చెక్కినట్లు చరిత్రలో వుంది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలిసారిగా అధికారిక చిహ్నాన్ని రూపొందించేందుకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ క్రమంలో 2500 సంవత్సరాల నాటి ‘అమరావతి' బౌద్ధస్థూపంలోని ధర్మచక్రం, పూర్ణఘటంతో ఈ చిహ్నాన్ని సృష్టించారు. దీంతోపాటు సత్యమేవ జయతే, నాలుగు సింహాలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం...వంటి గుర్తులు, వాక్యాలతో దీన్ని రూపొందించారు. ఆ తరువాత 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం తర్వాత కూడా ఇదే అధికారిక చిహ్నం కొనసాగింది. అయితే...ఆ తరువాత కాలక్రమంలో ఈ అధికారిక చిహ్నం ఏ విధమైన అధికారికమైన ప్రమేయం లేకుండానే అనధికారికంగా రకరకాల మార్పులకు గురైంది. ...

91 అడుగుల పొడవుండే కలువపువ్వు

Image
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌, ఈజిప్టులోని పిరమిడ్‌లు, ఢిల్లీలో అందమైన ఉద్యానవనం మధ్యలో ఉన్న హూమయూన్‌ టూంబ్‌ ఇవన్నీ ఎవరో ఒకరి స్మారక నిర్మాణాలే. ఇలా చక్కని కట్టడాలని ఆప్తుల కోసం కట్టించడం మనకు తెలిసిందే. అలాగే కేరళలోని తిరువనంతపురంలో కూడా ఓ స్వామిజీ మీద ప్రేమతో ఆయన శిష్యులు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. పెద్ద కలువ పువ్వు ఆకారంలో ఉన్న ఇది మ్యూజియం కూడా. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద స్మారక భవనాల్లో ఒకటిగా పేరు తెచ్చుకోనుంది. కొన్ని కిలో మీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. దీనిని అప్పటి మన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ గారు ప్రారంభించారు.  రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన చలువరాయితో దీన్ని నిర్మించారు. సుమారు లక్ష చదరపు అడుగుల చలువరాయిని ఉపయోగించారని అంచనా. ఈ కలువ పువ్వు ఎత్తు 91 అడుగులు, వెడల్పు 84 అడుగులు. లోపలి భాగంలో 12 గదులు ఉంటాయి. అందులో స్వామీజీ వాడిన వస్తువులను భద్రపరిచారు. కలువ పువ్వుకి ఉండే 21 రేకుల్లో, 12 పైకి ఉంటే, 9 పూర్తిగా కిందికి ఉంటాయి. పైకి ఉండే ఒకో రేకు పొడవు 41 అడుగులు ఉంటే, కిందికి ఉండేవి 31 అడుగుల పొడవుతో ఉంటాయి. దీనిని నిర్...

సంక్రాంతి

శూద్రుల పండుగే సంక్రాంతి ::-- ₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹. సంక్రాంతి మూడు రోజుల పండుగ. మెుదటి రోజు భోగి, రెండోరోజు సంక్రాంతి, మూడోరోజు కనుమ.మెుదటిరోజు పండుకకు స్వాగతం, రెం డో రోజు ఆసలైన పండుగ. మూడో రోజు పని వారి పండుగ.ఏంతో కోళాహళంగా, ఉత్సాహం తో జరిగే పండుగ.సూర్యుని ఉత్తరాయణ ప్రవే శం, సూర్యుని మకరరాశిలోకి ప్రవేశం ఈ రోజు ప్రత్యేకత. దీనినే పతాకాల పండుగ అంటారు. ప్రతి ఏడాది రైతులకు వచ్చే పంటల ఆవేజా పండుగ.రైతులు సంతోషంగా,ఉత్సాహ పూరి తంగా జరుపునేది.ఇదే శూద్రుల పండుగ. ఆం టే కేవలం శూద్రులే దీనిని జరుపుతారు.ఏండ్ల బళ్ళూ, ప్రక్కనే పటేళ్ళతో సాగుతుంది సరదా గా. కొన్ని చోట్ల వాటితో పాటు గుర్రాలు ఉంటా యి.ప్రతి ఏడాది15 వ తేదీ వచ్చే పండుగ కాని ఈ సంవత్సరం 14 నే వచ్చింది. సాంస్కృతిక పరాకాష్ట ఈ పండుగ.మన పల్లెల ఆచారాలు,సంప్రదాయాలను చూస్తాం. పల్లెల నుంచి ఏ పట్టణంలో ఉన్నా, ఏదేశంలో ఉన్నా వారందరూ కుటుంబ సమేతంగా తరలి పల్లెల కు రావాల్సిదే.యువకులు,యువతులు కొత్త బట్టలు ధరించి పల్లెలకు సంక్రాంతి శోభను తె స్తారు. యువతులు సంప్రదాయ బట్టలైన లం గా వోణీలతో,చీరెలతో కనువిందుచేసే పండు గ. తొలిరోజు భోగి మంటలతో పండుగకు స్వాగ తం. పెద్ద మ...

పూజలెందుకు జుగుప్సాకర బూతుల మయ మయ్యాయి?.

లంజలు రాకుండిన #గుడి రంజిల్లదు, ప్రజల మనసు రాజిల్లద్దు....అంట? పూజ అంటే ఏంటి? పూజకు పనికిరాని పువ్వు అంటే ఏమిటి? భోగం బజార్ అంటే ఏమిటి? రాచకార్యాలు వెళ్లగా పెట్టడం అంటే ఏమిటి? శృంగారంలో పూజలో పువ్వులు కామన్ గా ఎందుకు వాడతారు? గుడిలో పూజారి కులగోత్రాలు ఎందుకు అడుగుతాడు?  చదవండి.... బ్రాహ్మణీయ పూజలు జుగుప్సాకర బూతుల మయం.              భారతదేశములో  పూజ అంటే జనాలకు చాలా పవిత్ర భావం. ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మికత. కానీ లోతుల్లోకి  వెళ్తే పూజ అంటే బూతు లేదా శృంగారం. ఈ విషయం కొన్ని దేవాలయాల చరిత్రను చూస్తే అర్థం అవుతుంది.         తాపీధర్మారావు గారి “దేవాలయాలపై  బూతుబొమ్మలు” అనే పరిశోధనా గ్రంధం  ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అలాగే మనదేశములో అనేక దేవాలయాలపై అత్యంత జుగుప్సాకరమైన బూతుబొమ్మలు  దర్శనం యిస్తుంటై. మరి దేవాలయాలపై ఈ బూతుబొమ్మలేంటి అనే అనుమానం రాకపోదు. అంటే ఒకనాడు దేవాలయాలు శృంగార, కామకేంద్రాలు అని గుడుల చరిత్ర చూస్తే తెలుస్తుంది.         కృష్ణదేవరాయల కాలంలో ఖజానాకు ఎక్కువ ఆ...

చరిత్ర గుర్తించని ధిశాలి ఫాతిమా షేక్‌

Image
సామాజిక సేవకులు, రాజకీయ నాయకులను వారు అందించిన సేవల ద్వారా గుర్తు పెట్టుకుంటాం. శతాబ్దాలుగా ఎందరో నాయకులు సామాజికంగా, రాజకీయంగా ఎన్నో సేవలు చేస్తున్నారు. వీరిలో మహిళలు కూడా ఎందరో ఉన్నారు. అయితే కొందరు మహిళలు మాత్రమే సమాజంలో గుర్తింపబడుతున్నారు. చరిత్రపుటల్లో కంటికి కనబడని మహిళా మణిపూసలు ఎందరో ఉన్నారు. ఎంత సేవ చేసినా గుర్తింపుకు నోచుకోని మహిళల్లో ఫాతిమా షేక్‌ ఒకరు. ఈమె గురించి చాలా మందికి తెలియదు. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఆమె చేసిన విశేష కృషిని ఓసారి మననం చేసుకుందాం... పూణెలో బాలికల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే స్థాపించిన ఓ పాఠశాల బయట ఓ బోర్డు కనిపిస్తుంది. దీనిపైనా ఫాతిమా షేక్‌ పేరు వుంటుంది. చిందరవందరగా కనిపించే అక్కడి పాఠశాల గోడలను తీక్షణంగా పరిశీలిస్తే.. బాలికలతోపాటు ఇద్దరు మహిళలు కనిపిస్తారు. వారే సావిత్రీ బాయి, ఫాతిమా షేక్‌. దాదాపు 175 ఏండ్ల కిందట అదే ప్రాంతంలో ఓ విప్లవాత్మక మార్పుకు నాందిపలికిన వీర వనితలు వీరు. ఇవే గదుల్లో వారిద్దరూ కలిసి బాలికలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమె ఇల్లే మొదటి పాఠశాలగా... కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఫాతిమా జనవరి 9, 1831లో జన్మించినట్...

Samajwadi Party

Image
Samajwadi Party founded  4 October 1992 is a political party in India headquartered in  New Delhi . It is mainly based in  Uttar Pradesh . Originally  caste-based , the Samajwadi Party was one of several parties that emerged when the  Janata Dal  (People's League) fragmented into several regional parties. The party was founded by  Mulayam Singh Yadav  in 1992. Created just months before the  Babri Masjid demolition , the party is said to played a key role in preventing violence within the state following the event. The Samajwadi Party is now led by former  Chief Minister of Uttar Pradesh   Akhilesh Yadav  after he was chosen the President by the National Convention held on 1 January 2017. The Samajwadi Party is primarily based in  Uttar Pradesh State . It has contested  Lok Sabha  and State Assembly elections around the country, though its successes have been mainly in Uttar Pradesh. In the  2012 l...

Shiromani Akali Dal

Image
The  Shiromani Akali Dal  ( SAD )  is a  centre-right   Sikh -centric state political party in  Punjab ,  India . The party is the second-oldest in India, after  Congress , being founded in 1920. Although, there are many parties with the name  Akali Dal  but the party recognised as "Shiromani Akali Dal" by the  Election Commission of India  is the one led by  Sukhbir Singh Badal . It controls Sikh religious bodies  Shiromani Gurudwara Prabandhak Committee ,  Delhi Sikh Gurdwara Management Committee  and is the largest and most influential Sikh political party worldwide.The basic philosophy of Akali Dal was to give a political voice to Sikh issues and it believed that religion and politics go hand in hand  but  after 1996 the Moga Conference party adopted a moderate  Punjabi  secular agenda. On September 26th,2020 they left the NDA over the farms bill. Akali Dal was formed on 14 Decem...

చదివింది గుర్తు పెట్టుకోవాలంటే..?

     ఏరోజు పాఠం ఆరోజు చదువుకున్న విద్యార్థికి పరీక్ష తేదీనాటికి ఎలాంటి భయాలూ ఉండవు. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. కొన్ని అంశాలు తరగతి గదిలో నేర్చుకోనివి కూడా ఉంటాయి. పత్రికల్లో చదివినవి, లైబ్రరీ పుస్తకంలో చదివినవి ఉంటాయి. పుస్తకంలో చదివిన ప్రతి అంశానికీ నోట్సు రాసుకోవడం మంచి లక్షణం. పత్రికల క్లిప్పింగులను నోట్సులో అతికించుకోవచ్చు. విద్యాసంవత్సరం మొదలైన నాటి నుంచి, పరీక్ష తేదీ సమీపించే వరకూ విస్తృతమైన సమాచారం మన వద్ద ఉంటుంది. అదంతా మొదటినుంచీ క్రమపద్ధతిలో నోట్సు రూపంలో భద్రపరచుకున్నవారికి పరవాలేదు. అప్పుడప్పుడూ పునశ్చరణ చేసినవారికి పరవాలేదు. పరీక్షల ముందు హడావుడిగా పుస్తకాలు దులిపేవారికే వస్తుంది తంటా. మానవ మేధస్సులో లక్షలకొద్దీ పదాలతో కూడిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అయితే అదంతా ఒక క్రమపద్ధతిలో ఉండాలని లేదు. దాన్ని మనకు కావలసిన సమయంలో కావలసిన రూపంలో బయటకు తీసుకురాలేం. అందుకే పునశ్చరణ అవసరం.       పునశ్చరణ మొదటిసారి చేయడానికీ, రెండోసారి చేయడానికీ మధ్య తేడా ఉంటుంది. పాఠం అంతా కూలంకషంగా చదివిన కొద్దిరోజుల తర్వాత మొదటిసారి పునశ్చరణ చేస్తాం. రెం...

జనసేన

సినీనటుడు పవన్ కల్యాణ్ 2014 ఎన్నికల ముందు జనసేన పేరుతో పార్టీ స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్ల నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

DMK

తమిళనాట అన్నగా పిలిచే సి.ఎన్. అన్నాదురై (కంజీవరం నటరాజన్) నాటక రచయిత. సినీ మాధ్యమాన్ని రాజకీయప్రచారానికి వాడుకోవడం ఆయనతోనే మొదలైంది. ద్రవిడ కళగం(డీకే) కీలక వ్యక్తులలో ఆయన ఒకరు. తర్వాత కాలంలో పెరియార్‌ (ఈవీ రామస్వామి)తో విభేదాలు రావడంతో ద్రవిడ కళగం నుంచి బయటకొచ్చారు. డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కళగం) పేరుతో 1949లో పార్టీని స్థాపించారు. తర్వాత కాలంలో కరుణానిధి, ఎంజీఆర్ ఈ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. డీఎంకేలో వారసత్వ పోరు మొదలవడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఎంజీ రామచంద్రన్‌కు సినీనటుడుగా అభిమాన బలం ఉంది. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకొచ్చి17 అక్టోబర్ 1972లో ఆలిండియా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐడీఎంకే) ను స్థాపించారు. దీన్నే అన్నా డీఎంకే అనీ అంటారు. 1977లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన మృతి తర్వాత పార్టీలో విభేదాలు తలెత్తాయి. సినీనటిగా రాణించి అప్పటికే పార్టీలో మంచి గుర్తింపు పొందిన జయలలిత చేతుల్లోకి పార్టీ వెళ్లింది. 1989 నుంచి 2016లో చనిపోయేవరకు ఆమె పార్టీని నడిపించారు. తమిళనాట ఏఐడీఎంకే అత్యధికంగా ఏడుసార్లు అధికారంలోకి వచ్చింది. Dravida Munnetra Kazhagam ...