Posts

Showing posts from August, 2021

అక్షర అగ్నికణం షోయబుల్లాఖాన్

Image
"మరణం అనివార్యం, చావునుండి ఎవరు తప్పించుకోలేరు. ఆ మరణం ఒక మంచి లక్ష్యం కోసమైతే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు నాతో పాటు మీరు సంతోషించాలి''  అని మరణశయ్య మీదినుండి  తల్లి, దండ్రులకు, భార్యకు హితబోధ చేయడం అనేది వీరులకే సాధ్యం.  ఆ వీరుడు ఎవరంటే? అక్షరాన్ని అగ్నికణంలా మార్చి హైదరాబాద్ సంస్థానంలోని దొరల, దేశ్ ముఖ్ ల, రజాకార్ల ఆగాడాలను, నిజాం నిరంకుశ పాలనను సవాల్ చేస్తూ  నిప్పుకణికల్లాంటి అక్షరాలతో నిజాం వెన్నులో వణకుపుట్టించిన  ధీరుడు షహీద్ షోయబుల్లా ఖాన్.  హైదరాబాద్ విముక్తి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన తెలంగాణ నిప్పు రవ్వ  షోయబుల్లాఖాన్ ను నిజాం ప్రభుత్వం దారుణంగా హతమార్చింది. నేడు  షోయబుల్లాఖాన్ 73వ వర్ధంతి.   ఈ సంధర్భంగా మతమౌడ్యంపై, లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం ఆయన సాగించిన వీరోచిత  పోరాటాన్ని స్మరించి స్ఫూర్తి పొందుదాం. నిరంకుశత్వం ప్రజలపై కత్తులు దూస్తే అక్షరం ఆయుధమవుతుంది. కత్తుల  కోలాటంపై కలం కన్నెర్రచేస్తుంది. ఆ కలానికి సైద్ధాంతిక పటుత్వం తోడయితే పెత్తనాన్ని ధిక్కరించే స్వేఛ్చాగీత మవుతుంది. పీడనను...

Talibans: ఎవరీ తాలిబన్లు?

Image
       pc: 10tv.in Talibans: అసలు ఎవరీ తాలిబన్లు.. బలమైన రాజకీయ శక్తిగా ఎలా ఎదిగారు?.. వీరి లక్ష్యంగా ఏమిటి ? సోవియట్ దళాలు వైదొలిగిన తరువాత దేశంలోని ఉత్తర ప్రాంతాల్లోని గిరిజనుల హక్కుల కోసం తాలిబన్ సంస్థ ఏర్పడింది. వీరిలో కొందరు సోవియట్లకు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్ పోరాట యోధులు ఉన్నారు.   అమెరికా దళాలు వీడిన తరువాత అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. అఫ్గాన్ దళాలు వైమానిక దాడులకు పాల్పడుతున్నప్పటికీ తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉత్తర అఫ్గానిస్థాన్‌లోని చాలా ప్రాంతాలను వారు ఆధీనంలోకి తీసుకున్నారు. విదేశీ బలగాల ఉపసంహరణ తరువాత నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలోని 65 శాతం భూభాగాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అఫ్గాన్‌లోని ఏడు ప్రావిన్సులను తాలిబన్లు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నైరుతి అఫ్గాన్ ప్రావిన్స్‌ రాజధాని ఫరా నగరాన్ని, ఉత్తర ప్రావిన్స్ సమంగాన్ రాజధాని అయబాక్‌ను వారు ఆధీనంలోకి తీసుకున్నారు. గత వారాంతంలో మూడు ప్రావిన్షియల్ రాజధానులను వశం చేసుకున్నారు. దక్షిణ నిమ్రోజ్ ప్...
పొడవులను కొలిచే పద్ధతులు బెత్తెడు- 3 అంగుళాలు (దాదాపు) జానెడు- 3 (దాదాపు 9 అంగుళాలు) 12 అంగుళాలు మూర - 2 జానెలు (దాదాపు 18 అంగుళాలు) గజం - 3 అడుగులు (1 మీటర్ కంటే తక్కువ ఫర్లాంగు 220 గజాలు మైలు - 8 ఫర్లాంగులు కోసు - 2 మైళ్లు ఆమడ/పరువు - 8 మైళ్లు భూములను కొలిచే పద్ధతులు ఒక గుంట - 121 చదరపు గజాలు 40 గుంటలు - ఒక ఎకరం 100 గుంటలు - ఒక హెక్టారు (2 1/2 ఎకరాలు) ఒక ఎకరం - 4840 చ.గజాలు ఒక గొలుసు - 33 ఫీట్లు 40 గొలుసులు - ఒక ఎకరం

చుక్కల భూములు తీర్పు

#భూమిహక్కులపై_జస్టిస్_సివి_నాగార్జునరెడ్డి_తీర్పు_ ఒకమైలురాయి. రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు వివరాలను పొందుపరిచేందుకు ఉద్దేశించిన కాలమ్ను ఖాళీగా వదిలి వేసినంత మాత్రాన, అందులో డాట్లు ... పెట్టినంత మాత్రాన ఆ భూమి ప్రభుత్వ భూమి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ భూమికి సంబంధించి ఎవరి పేరు మీదైతే పట్టా ఉంటుందో ఆ వ్యక్తే ఆ భూ యజమాని అవుతారని స్పష్టం చేసింది. పట్టాదారు వివరాలను ఎందుకు సంబంధిత కాలమ్లో నమోదు చేయలేదో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. పట్టా లేనప్పుడు మాత్రమే రెవెన్యూ రికార్డులను ఆధారంగా చేసుకోవాలని అధికారులను ఆదేశించింది.  అంతేకాక యాజమాన్యపు హక్కును సూచించే పట్టా లేదా గ్రాంట్ లేకుండా ఓ వ్యక్తి స్వాధీనంలో భూమి 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే ఆ భూమిని తన పేరు మీద బదలాయించాలని కోరే హక్కు ఆ రైతుకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూమిపై అప్పటికే పలు అమ్మకపు లావాదేవీలు జరిగి ఉంటే యాజమాన్యపు హక్కు కోరేందుకు అవి ఆధారం అవుతాయని, దీనిపై అభ్యంతరం ఉంటే ప్రభుత్వమే సివిల్ కోర్టుకెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది.  18-6-1954...

Quotations

"A reader lives a thousand lives before he dies... The man who never reads lives only one." GEORGE R.R MARTIN

ఈ లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయ్‌ జాగ్రత్త!*

*🔊ఈ లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయ్‌ జాగ్రత్త!* *🍥ఆదాయపు పన్ను శాఖ బ్యాంకు సేవింగ్, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకర్ ప్లాట్ ఫారమ్స్ మొదలైన వంటి వాటిలో ప్రజల నగదు లావాదేవీలను త‌గ్గించడానికి పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ సంస్థల ద్వారా జరిగే నగదు లావాదేవిలపై ఒక నిర్దిష్ట పరిమితి విధించింది. ఈ నిబంధ‌న‌ల ఉల్లంఘన జరిగితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటి అనేది ఈ క్రింద తెలుసుకుందాం..* *👉బ్యాంక్ ఎఫ్​డీ(ఫిక్సిడ్ డిపాజిట్): చిన్న పెట్టుబడి పథకాలలో ఫిక్సిడ్ డిపాజిట్ అనేది ఒక మంచి ఆప్షన్. ఒక బ్యాంకు ఎఫ్​డీ ఖాతాలో నగదు డిపాజిట్ చేసే బ్యాంకు డిపాజిటర్ రూ.10 లక్షల మించి ఎఫ్​డీ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.* *👉రియల్ ఎస్టేట్: రియల్ ఎస్టేట్ ఒప్పందానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పరిమితిని విధించింది. మీరు ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు రూ.30 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపిస్తుంది.* *👉సేవింగ్స్/కరెంట్ అకౌంట్: ఒక వ్యక్తికి సంబంధించిన పొదుపు ఖాతాలో గనుక లక్ష ...

Basic Structure for Paper Writing

Basic Structure for Paper Writing ▸ Title (<10 words): The shorter, the better. Must accurately use the keywords that best describe your work. ► Keywords (<8 terms): These are the essential concepts that your artic e will discuss. A reader who is likely to search for these keywords must find your article relevant. ► Abstract (200-250 words): This is the first stop for the reader in your article. It must accurately summarize your problem statement/case study, what your solution is and how it adds value both qualitatively and quantitative y. > Introduction: Describe the history and motivation for the problem/case study. Elaborate on the improvements, innovations, or solutions (literature survey) chronologically. How is your idea/approach different and relevant? In the end, describe how the rest of the article is organized. ▸ Methodology: Here you present your idea or approach or experiment in a detailed manner. This section is the central piece of novelty which your article offe...